మళ్లీ కేక పుట్టిస్తోన్న రంగమ్మత్త.!

మరిన్ని వార్తలు

'రంగస్థలం' సినిమా టైమ్‌లో అనసూయ భరద్వాజ్‌ పేరు మార్మోగిపోయింది. అందుకు కారణం ఆమె పోషించిన రంగమ్మత్త క్యారెక్టరే. ఆ క్యారెక్టర్‌లో అనసూయని తప్ప మరొకరిని ఊహించుకోలేమన్నంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది అనసూయ. అలా వచ్చిన క్రేజ్‌తో, ఆ తర్వాత వరుస ఆఫర్లతో ఫర్వాలేదనిపించింది. ఇక ఇప్పుడు 'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, హీరో విజయ్‌ దేవరకొండ ఈ సినిమాని నిర్మించారు. నవంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్‌లో అనసూయ కేక పుట్టిస్తోంది.

 

హీరో, హీరోయిన్‌తో సమానంగా అనసూయ కూడా ప్రమోషన్స్‌ హోరెత్తించేస్తోంది. సోషలిస్ట్‌గా కీలక పాత్ర పోషించింది అనసూయ ఈ సినిమాలో. మగవాళ్లంటే పడని మహిళగా, క్లాసులు మీద క్లాసులు పీకుతూ ట్రైలర్‌లోనే అనసూయ క్యారెక్టర్‌ ఆసక్తి పెంచింది. అయితే, అది జస్ట్‌ ట్రైలర్‌ మాత్రమే. సినిమాలో అంతకు మించి ఉంటుందట. ఇక సినిమానే కొత్త కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రచార చిత్రాలు బాగా హోరెత్తిస్తున్నారు. యూత్‌ని టార్గెట్‌ చేసుకుని తీసిన సినిమానే కాబట్టి, ఖచ్చితంగా హిట్‌ కళ కనిపిస్తోంది ఈ సినిమాకి.

 

ఇక విజయ్‌ దేవరకొండ పబ్లిసిటీ స్ట్రాటజీ తెలిసిన సంగతే. ఇప్పటికే తనదైన శైలిలో ఈ సినిమాని ప్రమోట్‌ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో ఒక్కొక్క కంటెస్టెంట్‌నీ కన్‌ఫేషన్‌ రూమ్‌లో కలిసి 'మీకు మాత్రమే చెప్తా'.. మీకు మాత్రమే చెప్తా.. అంటూ తన సినిమాని పిచ్చ పిచ్చగా ప్రమోట్‌ చేసేశాడు. చూడాలిక, హీరోగా సరికొత్త స్టైల్‌ క్రియేట్‌ చేసుకున్న విజయ్‌ దేవరకొండ, నిర్మాతగానూ తన స్టైలేంటో చూపిస్తాడేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS