రంగమ్మత్త అప్పుడే చెప్పింది!

మరిన్ని వార్తలు

'అర్జున్‌రెడ్డి' సినిమా రిలీజైన కొత్తల్లో పెద్ద రచ్చే జరిగిన సంగతి తెలిసిందే. ఆ రచ్చలో రంగమ్మత్త చర్చ కూడా ఉంది. ఈ సినిమాలో హీరో చెప్పిన కొన్ని డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నటి, యాంకర్‌ అనసూయా భరద్వాజ్‌ మీడియాకెక్కిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్లో అనసూయ చర్చను లైట్‌ తీసుకున్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ ఇదే టైప్‌ రచ్చ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదే 'అర్జున్‌రెడ్డి'ని హిందీలో 'కబీర్‌సింగ్‌' టైటిల్‌తో రీమేక్‌ చేశాడు అదే డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా.

 

ఈయనపై అదే టైప్‌ విమర్శలు ఇప్పుడూ వస్తున్నాయి. అయితే, లేటెస్ట్‌గా సందీప్‌ వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అందుకు సమంత, చిన్మయి అసహనం వ్యక్తం చేసిన సంగతీ తెలిసిందే. అందుకాయన తిరిగి సారీ చెప్పినంత పని చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే, తాజాగా అనసూయ ఈ విషయమై చిన్మయికిచ్చిన ఓ కౌంటర్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. అప్పుడు అంటే 'అర్జున్‌రెడ్డి' టైంలోనే నేను ఖండించాను. కానీ, అప్పుడు నాకెవరూ సపోర్ట్‌ రాలేదు. కానీ, అలాంటి టాపిక్‌నే రైజ్‌ చేస్తూ ఇప్పుడు చిన్మయి ఇంత రచ్చ చేస్తుండడం నాకు కొంచెం బాధాకరంగా ఉంది.. ఇదే స్టాండ్‌ అప్పుడూ తీసుకొని ఉంటే బాగుండేది.. పోనీలే ఎట్టకేలకు ఇప్పటికైనా స్పందించారు.

 

దీంతో అప్పటి నా స్టాండ్‌కి కాస్త బలం చేకూరినట్లైంది. ప్రేమించడం అంటే, ఒకరిని ఒకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం కాదు.. గౌరవించడం అని అర్ధం తెలిపింది అనసూయ భరద్వాజ్‌. మొత్తానికి 'కబీర్‌సింగ్‌'తో బాలీవుడ్‌లోనే కాదు, మరోసారి టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు సందీప్‌ రెడ్డి వంగా. ఈ రకంగా తన సినిమాకి కొత్తరకం పబ్లిసిటీ స్ట్రాటజీ అప్లై అవుతుందనుకోవాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS