"సచ్చిందిరా గొర్రె"లో యాంకర్ అనసూయ

మరిన్ని వార్తలు

శ్రీనివాసరెడ్డి, టిల్లు వేణు, జబర్దస్త్ రాకేష్, శివారెడ్డి, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "సచ్చింది రా గొర్రె". శ్రీధర్‌ రెడ్డి యార్వ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపక్‌ ముకుత్, యన్.యమ్.పాషాలు అపర్ణ కిటే తో కలిసి సోహామ్ రాక్ స్టార్ ఎంటర్ టైన్మెంట్-ఎంటర్ టైన్మెంట్ స్టూడియో బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంలో కథానాయికగా పాపులర్ యాంకర్ అనసూయ నటించనుంది. త్వరలోనే షూటింగ్ లో పాలుపంచుకోనున్న అనసూయ ఈ క్రేజీ ప్రోజెక్ట్ కి అదనపు ఆకర్షణగా నిలవనుంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. "ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం నవ్వులు పండిస్తుంది. దర్శకుడిగా ఇదే నా తొలి చిత్రమైనప్పటికీ.. డిఫరెంట్ జోనర్ లో డార్క్ కామెడీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. అనసూయ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది" అన్నారు.

అనసూయ మాట్లాడుతూ.. "పర్టీక్యులర్ గా హీరో-హీరోయిన్ అనేది కాకుండా కేవలం కథే హీరోగా నడిచే సినిమా ఇది. అందులోనూ ఈ సినిమాలో తెలంగాణా సాంస్కృతిక గీతం అయిన ఒగ్గు కథ ఉండడం నన్ను అమితంగా ఆకట్టుకుంది. సినిమాటిక్ గా ఉంటూనే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగేలా "సచ్చిందిరా గొర్రె" ఉండబోతోంది" అన్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS