ఏఎన్నార్ జాతీయ అవార్డుల్ని ఈరోజు, కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. 2018 సంవత్సరానికి గానూ శ్రీదేవికి, 2019 సంవత్సరానికి గానూ రేఖకు ఈ అవార్డులు అందజేస్తారు. ఈనెల 17న చిరంజీవి చేతుల మీదుగా ఈ పురస్కారాల ప్రదానం జరగబోతోంది. శ్రీదేవి తరపున బోనీకపూర్ ఈ అవార్డు స్వీకరిస్తారు. అవార్డు క్రింద 5 లక్షల నగదు బహుబతి అందివ్వనున్నట్టు నాగార్జున ప్రకటించారు.
గతంలో అమితాబ్బచ్చన్, బాలచందర్, దేవానంద్, రాజమౌళి, లతా మంగేష్కర్ తదితర సినీ ప్రముఖులు ఏఎన్నార్ అవార్డులు అందుకున్నారు. అక్కినేనితో శ్రీదేవి, రేఖలకు మంచి అనుబంధం ఉంది. ఏఎన్నార్ - శ్రీదేవి కాంబినేషన్లో ప్రేమాభిషేకం, శ్రీవారి ముచ్చట్లు లాంటి సూపర్ హిట్ చిత్రాలొచ్చాయి. రేఖ తో ఏఎన్నార్కి మంచి అనుబంధం ఉంది. అన్నట్టు.. ఇద్దరూ తెలుగు నుంచి హిందీవైపుకు వెళ్లి, అక్కడ స్టార్లుగా ఎదిగినవాళ్లే.