జేజమ్మ ఏం చేస్తుందో తెలుసా?

మరిన్ని వార్తలు

'బాహుబలి' తర్వాత జేజమ్మ అనుష్క నుండి వచ్చిన 'భాగమతి' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత అనుష్క మరో కొత్త సినిమాకి సైన్‌ చేసినట్లు వివరాలు లేవు. కానీ గౌతమ్‌ మీనన్‌ చిత్రం చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. 

'భాగమతి' సినిమాలో కాస్త లావుగా కనిపించిందని కామెంట్స్‌ ఎదుర్కొన్న అనుష్క, ఇప్పుడు సినిమాల నుండి కాస్త బ్రేక్‌ తీసుకుని పూర్తిగా ఫిజిక్‌పై దృష్టి పెట్టిందట. 'సైజ్‌ జీరో' సినిమా కోసం పెరిగిన బరువు తన కెరీర్‌కి చాలా చాలా అడ్డంకిగానే మారింది. ఎంత తగ్గినా, మునపటి అనుష్కలా తన ఫిజిక్‌ని మార్చుకోలేకపోయింది. అయితే ముందుగా ఒప్పుకున్న కమిట్మెంట్స్‌ పరంగా ఎలాగోలా కష్టపడి 'భాగమతి' సినిమా కంప్లీట్‌ చేసింది. కానీ ఈ సారి మాత్రం తన మునుపటి ఫిజిక్‌ని పొందిన తర్వాతే కొత్త సినిమాలకు సైన్‌ చేయాలనే యోచనలో అనుష్క ఉన్నట్లు తెలుస్తోంది. 

అందుకే ఆ ఫిజిక్‌ని పొందడం కోసం అనుష్క తెగ కష్టపడుతోందట. మరో పక్క చాలా కాలం తర్వాత దొరికిన ఈ ఫ్రీ టైమ్‌ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తూ గడుపుతోందట. అలాగే వీలు చిక్కినప్పుడల్లా దైవభక్తిలో కూడా మునిగి తేలుతోందట. అందులో భాగంగానే కేదార్‌నాధ్‌, బద్రీనాధ్‌ ఆలయాలను సందర్శించింది అనుష్క. 'బాహుబలి' సినిమా తర్వాత జేజమ్మ పెళ్లి కబురు చెబుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. 

కానీ ఇంకా ఇప్పుడప్పుడే ఆ ముచ్చట తీరేలా కనిపించడం లేదు. సన్నగా నాజూగ్గా మారి, మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనే యోచనలో అనుష్క ఉందని తెలుస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS