దాదాపు రెండేళ్ల తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం 'సైలెన్స్'. తెలుగులో 'నిశ్శబ్ధం' టైటిల్తో విడుదలవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. తమిళ హీరో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జనవరి 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. అయితే, సీసీ వర్క్ పెండింగ్లో ఉన్న కారణంగా సినిమాని పోస్ట్ పోన్ చేసే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
అలాంటిదే లేదనీ, అనుకున్న టైమ్కే సినిమా విడుదల చేయనున్నారనీ తాజాగా అందుతోన్న సమాచారం. అయితే, పోస్ట్పోన్ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే, చిత్ర యూనిట్ మరోసారి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరముంది. అప్పుడెప్పుడో వదిలిన ఫస్ట్లుక్, టీజర్, సాంగ్ ప్రోమో తప్ప ఈ సినిమాకి సంబంధించి మరే అప్డేట్ లేదింతవరకూ. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోన ఫిలిమ్స్ బ్యానర్లో రూపొందింది. ఎక్కువ భాగం అమెరికాలోనే షూటింగ్ జరిగింది. అనుష్క లీడ్ రోల్ పోషిస్తుండగా, తెలుగమ్మాయ్ అంజలి, 'అర్జున్ రెడ్డి' భామ షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ పాత్ర పోషిస్తుండగా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో అంజలి నటిస్తోంది. మాధవన్ ఫేమస్ మ్యూజిషియన్గా కనిపించనున్నారు.