సూపర్ హిట్ డైరెక్టర్ అకాల మరణం!

మరిన్ని వార్తలు

అయ్యప్పనుం కోషియమ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి సూపర్ హిట్ చిత్రాలు అందించిన మళయాళ దర్శకుడు 'సాచి(48)' నిన్న రాత్రి థ్రిస్సురు లో మరణించారు. కొంత కాలం క్రిందట నడుముకి సర్జరీ చేయించుకున్న సాచి.. మంగళవారం గుండె పోటు తో హాస్పిటల్ లో చేరారు. 'ఐసియు' లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు.

 

సచితానందన్ ఆక సాచి మొదట కేరళ హైకోర్టు లో న్యాయవాదిగా పనిచేసేవారు. 2015 లో అనార్కలి అనే చిత్రం తో పరిచయమయ్యారు. రన్ బేబీ రన్, చేట్టేయస్ వంటి పలు చిత్రాలకు రైటర్ గా కూడా పనిచేసాడు సాచి. సాచి దర్శకత్వం వహించిన అయ్యప్పనుం కోషియమ్ గతేడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్ర తెలుగు రీమేక్ రైట్స్ కూడా సితార సంస్థ సొంతం చేసుకుంది.

 

ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సాచి కుటుంబ సభ్యులకు తమ సంతాపం తెలియజేసారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS