రోజుకో ద‌ర్శ‌కుడు మారుతున్నాడు

By iQlikMovies - June 13, 2020 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌`. తెలుగులో ఈ సినిమాని రీమేక్ చేసే ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. హీరోలుగా రానా, ర‌వితేజ ఫిక్స‌య్యారు. అయితే ద‌ర్శ‌కుడెవ‌ర‌న్న‌ది ఇంకా ఖ‌రారు కాలేదు. కాక‌పోతే చాలా పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి, వ‌స్తున్నాయి.

 

ముందు త్రివిక్ర‌మ్ ఈ సినిమా చేస్తార‌ని చెప్పుకున్నారు. కానీ అది గాసిప్ అని తేలిపోయింది. ఆ త‌ర‌వాత హ‌రీష్ శంక‌ర్ పేరు గ‌ట్టిగా వినిపించింది. ఆత‌ర‌వాత సుధీర్ వర్మని ఖాయం చేశార‌ని చెప్పుకున్నారు. ఇప్పుడు సాగ‌ర్ చంద్ర తెర‌పై కొచ్చాడు. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సాగర్... ఈ రీఏమ‌క్‌ని ప‌ట్టాలెక్కిస్తార‌న్న‌ది తాజా స‌మాచారం. మ‌రి ఈ పేరైనా ఖాయ‌మా? లేదంటే మ‌రో ద‌ర్శ‌కుడు ట్రాక్‌పై వ‌స్తాడా? అన్న‌ది చూడాలి. మొత్తానికి ఆగ‌స్టు నుంచి ఈసినిమా మొద‌ల‌వ్వ‌డం ఖాయంగా అనిపిస్తోంది. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS