డేంజర్ జోన్ లో ఉన్న బిగ్ బాస్ సభ్యులు వీరే..

మరిన్ని వార్తలు

ప్రతి ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్ అంటే ఆ ఇంటి సభ్యులకే కాక బయట షో చూస్తున్న వారికి కూడా చాలా టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది.

అయితే ఆ టెన్షన్ మరెందుకోసమో కాదు ఎలిమినేషన్ కోసం.. ఇక ఈ వారం నామినేట్ అయిన ఆరుగురిలో ఇద్దరు ఇప్పటికే సేఫ్ జోన్ లోకి వెళ్ళగా మిగిలిన నలుగురు- బాబు గోగినేని, దీప్తి సునైనా, తనీష్ & గణేష్ లలో ఒకరు ఈరోజు ఇంటి నుండి వెళ్ళిపోనున్నారు.

ఇప్పుడు ఈ నలుగురిలో బయట వినిపిస్తున్న వార్తల ప్రకారం బాబు గోగినేని లేదా తనీష్ లకి ఇంటి నుండి వెళ్ళిపోయే పరిస్థితి ఉండొచ్చట. ఇక మిగిలిన ఇద్దరిలో దీప్తి ఈ వారం చాలా యాక్టివ్ గా ఇంటిలో టాస్క్ లలో పాల్గొనడం వల్ల ఆమె ఇంటి నుండి నిష్క్రమించే పరిస్థితి లేదు అని చెప్పొచ్చు.

ఇక సామన్యుడు అయిన గణేష్ ఈవారం అంత పెద్దగా ఎవరిని ఆకట్టుకోలేని కారణంగా అతనకి కూడా ఇంటి నుండి నిష్క్రమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.

అయితే ఈ నలుగురిలో ఎవరుంటారు.. ఎవరు ఉండరు.. అనేది ఈ రాత్రికి తేలిపోనుంది.. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS