బాల‌య్య భయ‌ప‌డుతున్నాడా?

మరిన్ని వార్తలు

నవ‌త‌రం హీరోల‌తో పాటు, స్టార్లు కూడా మ‌ల్టీస్టార‌ర్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. నా పాత్రేమిటి? దాని నిడివి ఎంత‌? అనే విష‌యాల్ని ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. క‌థ న‌చ్చితే.. ఓకే అనేస్తున్నారు. అయితే బాల‌కృష్ణ మాత్రం మ‌ల్టీస్టార‌ర్‌కి భ‌య‌ప‌డుతున్నాడ‌ని టాక్‌. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన అయ్య‌ప్ప‌య‌నుమ్ కోషియుమ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఫృథ్వీరాజ్‌, బీజూ మీన‌న్ క‌థానాయ‌కులుగా న‌టించారు. ఈ చిత్రాన్ని బాల‌య్య రీమేక్ చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. రెండో పాత్ర‌లో రానా క‌నిపిస్తాడ‌ని చెప్పుకున్నారు.

 

అయితే... ఈ రీమేక్ చేయ‌డానికి బాల‌య్య ఏమాత్రం ఉత్సాహంచూపించ‌డం లేద‌ని తెలుస్తోంది. దానికీ కార‌ణాలు ఉన్నాయి. ఇది వ‌ర‌కు కూడా బాల‌కృష్ణ కొన్ని మ‌ల్టీస్టార‌ర్‌లు చేశాడు. గాంఢీవం, సుల్తాన్‌, ఊకొడ‌తారా - ఉలిక్కి ప‌డ‌తారా ఓ ర‌కంగా మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలే. ఇవేమీ బాల‌య్య‌కు మంచి ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేక‌పోయాయి. అందుకే గత ఫ‌లితాల‌ను దృష్టిలో ఉంచుకుని, రీమేక్ చేయ‌డానికి బాల‌య్య ఆలోచిస్తున్నాడ‌ని స‌మాచారం. దానికి తోడు... బాల‌కృష్ణ బోయ‌పాటి శ్రీ‌ను సినిమాతో బిజీ. ముందు అది పూర్తి చేయాలి. ఆ త‌ర‌వాతే.. రీమేక్ గురించి ఆలోచిస్తాడు. అప్ప‌టి వ‌ర‌కూ... ఈ సినిమాని రీమేక్ చేయ‌కుండా ఆగుతారా? అందుకే బాల‌య్య స్థానంలో మ‌రో హీరోని వెదుక్కోవ‌డం ఖాయం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS