'పైసావసూల్‌' టీజరొచ్చేస్తోంది

మరిన్ని వార్తలు

డ్రగ్స్‌ గందరగోళం చెలరేగినప్పటికీ, పూరి జగన్నాథ్‌ 'పైసావసూల్‌' సినిమా షెడ్యూల్స్‌ వేటినీ వెనక్కి నెట్టలేదు. అది అతని కమిట్‌మెంట్‌కి నిదర్శనం. ఎంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సినిమా అంటే పూరికి ఉన్న ప్యాషన్‌ వేరు. ఆ విషయంలో పూరీ ఆటిట్యూడ్‌కి హ్యాట్సాప్‌ అనాల్సిందే. అందుకే 'పైసావసూల్‌' సినిమాని అనుకున్నట్లుగానే తెరకెక్కిస్తున్నాడు. డ్రగ్స్‌ ఇష్యూతో పూరీ అప్‌సెట్‌ అయిన మాట వాస్తవమే. కానీ షూటింగ్‌ షెడ్యూల్‌లో ఏమాత్రం మార్పులు చేర్పులు రానివ్వలేదు పూరీ. అంత కమిట్‌మెంట్‌తో చేస్తున్నాడు కాబట్టే, ముందుగా అనుకున్న విధంగానే జులై 28న ఈ సినిమా టీజర్‌ రాబోతోంది. ఇది బాలయ్య అభిమానులకు పండగ లాంటి వార్త. టీజర్‌తోనే బాలయ్య అభిమానులు పండగ మొదలు పెట్టేయొచ్చని పూరి నుంచి సంకేతాలు అందుతున్నాయి. బాలయ్య ఎలా తెరపై కన్పించాలని అభిమానులు కోరుకుంటారో, అలా బాలయ్యని చూపించబోతున్నానని సినిమా ప్రారంభోత్సవం రోజునే చెప్పాడు పూరి. ఆ మాట నిలబెట్టుకున్నాడట. ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనాన్ని బట్టి టీజర్‌ని సూపర్బ్‌గా కట్‌ చేసినట్లు తెలియవస్తోంది. పూరి ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్‌ని డైలాగులంటే అదిరిపోయేలా చెప్పే నటసింహం నోట వింటే ఆ కిక్కే వేరప్పా. శ్రియ, ముస్కాన్‌ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముద్దుగుమ్మ కైరా దత్‌ స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తోంది. ముద్దుగుమ్మ ఛార్మి ప్రొడక్షన్‌ బాద్యతలు నిర్వహిస్తోంది. అనుకున్న డేట్‌కి ఒకటి రెండు రోజుల ముందే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానంటున్నాడు పూరీ జగన్నాధ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS