బాల‌య్య ఈ సారి ఖచ్చితంగా బ‌రువు త‌గ్గాల్సిందే..!

మరిన్ని వార్తలు

దాదాపు మూడు నెల‌ల పాటు రాజ‌కీయాల్లో త‌ల‌మున‌క‌లైపోయాడు బాల‌కృష్ణ‌. ఎన్నిక‌ల హంగామా ముగిసింది. ఇప్పుడు మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. బాల‌య్య త‌దుప‌రి చిత్రం బోయ‌పాటి శ్రీ‌నుతో అనే సంగ‌తి తెలిసిందే. క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు ఫ్లాపులు అవ్వ‌డంతో ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు బాల‌య్య‌. మ‌రోవైపు బోయ‌పాటి శ్రీ‌నుది కూడా అదే ప‌రిస్థితి. విన‌య విధేయ రామా లాంటి డిజాస్ట‌ర్ త‌ర‌వాత త‌న‌ని తాను నిరూపించుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. అందుకే బాల‌య్య సినిమాపై ఫోక‌స్ పెట్టాడు. కెరీర్ ప‌రంగా ఈ సినిమా ఇద్ద‌రికీ చాలా కీల‌కం. అందుకే ఈ సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు వినికిడి.

మే - జూన్‌ల‌లో షూటింగ్ ప్రారంభం కావాల్సిఉంది. కాక‌పోతే..ఇప్పుడు కాస్త ఆల‌స్యంగా ప‌ట్టాలెక్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. బాల‌య్య ఈమ‌ధ్య బాగా బొద్దుగా త‌యార‌య్యారు. ఎండ‌లో తిర‌డం వ‌ల్ల గ్లామ‌ర్ దెబ్బ‌తింది. అందుకే తేరుకోవ‌డానికి మ‌రికాస్త స‌మ‌యం తీసుకోవాల‌నుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. జిమ్‌లో క‌స‌ర‌త్తు చేసి - బ‌రువు త‌గ్గాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం బాల‌య్య అదే ప‌నిలో ఉన్నార‌ని, క‌నీసం మూడు నెల‌ల పాటు బ‌రువు త‌గ్గేందుకు క‌స‌ర‌త్తులు చేస్తార‌ని, కావ‌ల్సిన షేప్ వ‌చ్చాకే షూటింగ్ మొద‌లెడ‌తార‌ని స‌మాచారం. ఎప్పుడు మొద‌లెట్టినా స‌రే.. ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌న్న‌ది బాల‌య్య ప్లాన్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS