చెప్పిందే చేస్తాడు.. ఎవరి మాటా వినడు బాలయ్య..!

మరిన్ని వార్తలు

ఎలక్షన్స్‌ తర్వాత మారిన పరిణామాల దృష్ట్యా బాలయ్య ఇకపై సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తారనే ప్రచారం జరిగింది. బావ చంద్రబాబు నాయుడు సీఎం పదవిని కోల్పోయిన కారణంగా, తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత పూర్తిగా బాలయ్యపై పడిందనీ, ఈ కారణంగా ఆయన ఇటు సినిమాలనీ, అటు రాజకీయాలనీ మ్యానేజ్‌ చేయడం సాధ్యం కాని పని కనుక, పూర్తిగా రాజకీయాలకే అంకితమవ్వాల్సి వస్తుందని సో 'ఎన్టీఆర్‌' బయోపిక్‌నే బాలయ్య చివరి చిత్రంగా అభిమానులు భావించాలేమోననే పుకార్లు షికారు చేశాయి. కానీ వాటిన్నింటికీ చెక్‌ పెట్టేసి, ఎవరి మాటా వినడు బాలయ్యా.. అంటూ తన కొత్త సినిమాని లాంఛ్‌ చేసేశాడు బాలయ్య. బాలయ్య 105వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో సి. కళ్యాణ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

 

పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. జూలై నుండి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. హీరోయిన్‌గా పలువురు భామల పేర్లు వినిపిస్తున్నాయి. శ్రియ, నయనతార వంటి స్టార్‌ హీరోయిన్స్‌ పేర్లతో పాటు, కొత్త భామలు పాయల్‌ రాజ్‌పుత్‌ తదితర పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేరు ప్రధానంగా చర్చల్లో ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS