#RRR కోసం జ‌క్క‌న్న మ‌రో భారీ స్కెచ్‌!!

మరిన్ని వార్తలు

రాజ‌మౌళి స్కెచ్చులు మూమూలుగా ఉండ‌వు. త‌న సినిమాకి క్రేజ్ ఎలా తెచ్చుకోవాలో త‌న‌కు బాగా తెలుసు. రాజ‌మౌళి మార్కెటింగ్ తెలివితేట‌లు బాహుబ‌లి స‌మ‌యంలోనే బ‌య‌ట‌ప‌డిపోయాయి. ఆ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిల‌బెట్ట‌డానికి రాజ‌మౌళి చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. అయితే అవ‌న్నీ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయి. ఇప్పుడు #RRR కోసం కూడా అలాంటి స్కెచ్చులే వేస్తున్నాడు. #RRR సినిమా కోసం దాదాపు 350 కోట్లు ఖ‌ర్చు పెట్టిస్తున్నాడు రాజ‌మౌళి. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు హీరోలు కాబ‌ట్టి సౌతిండియాలో ఈసినిమా మార్కెట్‌కి తిరుగుండ‌దు. బాలీవుడ్‌ని ఆక‌ర్షించడానికి అక్క‌డి నుంచి అలియాభ‌ట్‌ని దిగుమ‌తి చేశారు. అయితే... అది స‌రిపోవ‌డం లేదు. ఈ సినిమా రేంజ్ ఇంకాస్త పెంచాలి.

 

అందుకే...ఇప్పుడు రాజ‌మౌళి మ‌రో స్కెచ్ వేయ‌బోతున్నాడు. అతిథి పాత్ర‌ల రూపంలో కొంత‌మంది స్టార్ హీరోల్ని, హీరోయిన్ల‌నీ రంగంలోకి దింపాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. అందులో భాగంగా ప్ర‌భాస్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ప్ర‌భాస్‌కి రాజ‌మౌళి ఎంత చెబితే అంత‌. ప్ర‌భాస్‌కే కాదు.. రాజ‌మౌళి అడిగితే ఏ హీరో అయినా స‌రే, చిన్న పాత్ర చేయ‌డానికైనా ముందుకొస్తాడు. అందుకే... ఒక‌రిద్ద‌రి పేర్లు ఈ సినిమా కోసం ప‌రిశీలిస్తున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. అనుష్క‌తోనూ గెస్ట్ రోల్ చేయించాల‌ని భావిస్తున్నాడ‌ట‌.చిన్న చిన్న పాత్ర‌ల‌లో కూడా పేరున్న న‌టుల్ని తీసుకోవ‌డం ద్వారా ఈ సినిమా రేంజ్ పెంచాల‌ని, బాలీవుడ్ మార్కెట్‌ని ఆక‌ర్షించాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నాడు. అంతా అనుకున్న‌ట్టే జ‌రిగితే.. ఈ సినిమాలో ప్ర‌భాస్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌డం ఖాయం. అదే జ‌రిగితే... #RRR కి ఇక తిరుగుండ‌దు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS