ఎంటర్‌ ది డ్రాగన్‌: బండ్ల గణేష్‌ ఆన్‌ సెట్స్‌!

మరిన్ని వార్తలు

ఈ మధ్య రాజకీయాల్లో, తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్ధుల్ని ఓ ఆట ఆడించిన నటుడు బండ్ల గణేష్‌. అయితే ఆయన అనుకున్నదేమీ పాలిటిక్స్‌లో జరగకపోయేసరికి, తిరిగి సినిమాలనే నెక్స్ట్‌ ఆప్షన్‌గా ఎంచుకున్నాడు బండ్ల గణేష్‌. చాలా కాలం తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకున్నాడు. మహేష్‌బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'లో బండ్ల గణేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ని కాశ్మీర్‌లో విజయవంతంగా పూర్తి చేసుకుంది.

 

ఇక రెండో షెడ్యూల్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌ని హైద్రాబాద్‌లో ప్లాన్‌ చేశారు. వెరీ లేటెస్ట్‌గా సెట్స్‌ మీదికెళ్లిన ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో బండ్ల గణేష్‌ కూడా జాయిన్‌ కానున్నాడు. ఓ ట్రెయిన్‌ ఎపిసోడ్‌కి సంబంధించిన సీన్‌లో బండ్ల గణేష్‌ కనిపించనున్నాడనీ సమాచారం. అదో స్టన్నింగ్‌ ఎంట్రీ అని తెలుస్తోంది. ఇంతవరకూ కమెడియన్‌గా, సపోర్టింగ్‌ ఆర్టిస్ట్‌గా తన నటనా పాఠవాల్ని ఘనంగా చూపించిన బండ్ల గణేష్‌ నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నాడు.

 

ఎన్నో విజయవంతమైన సినిమాల్ని రూపొందించాడు. ఇక ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆసక్తికరమైన పాత్రలకు టెండర్‌ పెట్టాడట. ఆ క్రమంలోనే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఓ డిఫరెంట్‌ రోల్‌ బండ్ల గణేష్‌ తలుపు తట్టడంతో రాజకీయాలు హోల్డ్‌లో పెట్టేసి, వెంటనే ఓకే చేసేశాడట. ఈ సినిమాలో సీనియర్‌ నటి విజయశాంతి మరో కీలక పాత్రలో నటించనున్నారు. రష్మికా హీరోయిన్‌గా నటిస్తోంది. తొలిసారి ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్‌బాబు నటిస్తున్నారీ సినిమాలో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS