ఆరడుగుల అందగాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'సాక్ష్యం' సినిమా రిలీజ్ డేట్ అంతకంతకూ వెనక్కి వెళుతూ వస్తోంది. 'బాహుబలి' తరహాలో ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఉంటాయట. ఆ స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఈ సినిమా ఇంత ఆలస్యం కావస్తోందనీ సమాచారమ్.
ఏప్రిల్లో రావల్సిన సినిమా కాస్తా, జూలైకి పోస్ట్పోన్ అయ్యింది. జూలై 20న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట. ఇటీవల విడుదలైన టీజర్తో ఈ సినిమా కర్మ సిద్ధాంతం ఆధారంగా రూపొందుతోందని తెలుస్తోంది. పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం 'బాహుబలి' చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీమ్లో కొంతమంది వర్క్ చేస్తున్నారట. ఈ టీమ్ సారధ్యంలో 'సాక్ష్యం' సినిమా అత్యంత భారీ విజువల్ ఎఫెక్ట్స్ చిత్రంగా రూపుదిద్దుకుంటోందట. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలుగానే రూపొందుతుండడం విశేషం.
తొలి సినిమా 'అల్లుడు శీను' కోసం స్టార్ హీరోయిన్ సమంతను అత్యంత రెమ్యునరేషన్ ఇచ్చి హీరోయిన్గా ఎంచుకున్నారు. ఈ సినిమాలోని సెట్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టారు. ఇక ఇప్పుడు తాజాగా రూపొందుతోన్న 'సాక్ష్యం' కోసం మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టారనీ తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా, ఫుల్ క్వాలిటీతో సినిమాని రూపొందిస్తున్నారట. బడ్జెట్ భారీతనం సరే. తిరుగులేని సక్సెస్కి 'సాక్ష్యం'గా మన బెల్లంకొండ నిలుస్తాడో లేదో చూడాలి మరి.