సాక్ష్యం చిత్రానికి బంపర్ ఆఫర్

మరిన్ని వార్తలు

తెలుగు చిత్రాలని హిందీలో డబ్బింగ్ చేసి హిందీ ఛానెల్స్ లో ప్రాసారం చేస్తుంటే ఆ సినిమాలకి వచ్చే TRP రేటింగ్స్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటున్నాయి. ఇప్పుడు అలాంటి ఒక తెలుగు చిత్రానికి డబ్బింగ్ పరంగా ఒక మంచి ధరతో కూడిన ఆఫర్ వచ్చింది.

ఆ చిత్రమేమిటంటే- బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం సాక్ష్యం. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది అలాగే ఈ చిత్రం విడుదలకి ముందే మంచి బిజినెస్ చేస్తున్నది. 

ఆ బిజినెస్ వివరాల్లోకి వెళితే, సాక్ష్యం చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ సుమారు రూ 8కోట్లకి అమ్ముడైనట్టు సమాచారం. ఇప్పటికే మన తెలుగు చిత్రాలని డబ్బింగ్ చేసి హిందీలో విడుదల చేస్తుంటే అక్కడి ప్రజలు వీటికి బ్రహ్మరధం పడుతున్నారు.

మొత్తానికి సాక్ష్యం చిత్రం విడుదలకి ముందే ఇంతటి బిజినెస్ చేయడం గమనార్హం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS