సమీరా అవుట్‌ భాను ఇన్‌.. ‘అదిరింది’

మరిన్ని వార్తలు

బుల్లితెరపై జబర్దస్త్‌ కామెడీ షోకి పోటీగా ప్రసారమవుతున్న నవ్వుల షో ‘అదిరింది’. జబర్దస్త్‌ నుండి నవ్వుల నవాబు నాగబాబు తప్పుకున్నాక, మరో ఛానెల్‌లో ఈ షోని స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ షోకి నాగబాబుతో పాటు, యంగ్‌ స్టర్‌ నవదీప్‌ జడ్డ్‌లుగా వ్యవహరిస్తున్నారు. యాంకర్‌గా సమీరా కొనసాగింది. అయితే, లేటెస్ట్‌గా సమీరా పోస్ట్‌కి ఎసరు పడ్డట్లు తెలుస్తోంది. ఈ ప్లేస్‌ని బిగ్‌బాస్‌ బ్యూటీ భానుశ్రీ ఎగరేసుకెళ్లిపోయింది. షో స్టార్ట్‌ అయినప్పటి నుండీ, యాంకర్‌ ఎంపిక పట్ల ఆడియన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా వేదికగా ‘అదిరింది’ యాంకర్‌ పట్ల తమ తమ అభిప్రాయాను కాస్త ఘాటుగానే వ్యక్తపరుస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు, జబర్దస్త్‌కి పోటీగా, అంతకు మించి అనేలా స్టార్ట్‌ అయిన ఈ షో, ఇంతవరకూ జబర్దస్త్‌ని బీట్‌ చేయలేకపోయింది. అందుకు కారణం యాంకర్‌ లోపమే అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. దాంతో షో నిర్వాహకులు మేల్కొన్నారు.

 

యాంకర్‌ని మార్చి, షోకి అదనపు గ్లామర్‌ అద్దాలనుకున్నారు. ఎట్టకేలకు ఆ ప్లేస్‌ని హాట్‌ బ్యూటీ భానుకి ఇచ్చేశారు. భానుతో పాటు, రొమాంటిక్‌ గై రవి కూడా యాడ్‌ అవ్వడంతో, ఈ షో ఇప్పుడు అనుకున్న అంచనాల్ని అందుకునే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే, ఎప్పుడూ ఏడుపుగొట్టు పాత్రలతో సీరియల్స్‌లో కనిపించే సమీరా నవ్వుల ప్రోగ్రామ్‌ ‘అదిరింది’తో బంఫర్‌ ఆపర్‌ కొట్టిందనుకుంది. ఇంతలోనే పాపం ఆ ఆఫర్‌ ఇలా చేజారిపోయేసరికి ఏం చేయాలో తోచక తెగ ఫీలయిపోతోంది. ఎందుకు తీసేశారో తెలీదు కానీ, షో మంచికే అయ్యుంటుందిలే.. ఈ షో ఇకపై మరింత సక్సెస్‌ అవ్వాలని ఆశిస్తున్నా.. అంటూ ఓ వీడియో ద్వారా సోషల్‌ మీడియాలో సమీరా స్పందించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS