బిగ్బాస్ ఫినాలే అంటే ఎక్కడ లేని ఉత్కంఠ చోటు చేసుకోవాలి. కానీ, ఆ రకమైన ఉత్కంఠ ప్రేక్షకుల్లో కనిపించడం లేదు. కౌషల్ ఆర్మీ చేసిన హల్చల్తో గత సీజన్ క్లైమాక్స్ ఊపిరి పీల్చుకోనీయకుండా చేసింది. కానీ, ఇప్పుడు ఎవరొచ్చినా ఏంటిలే.? అయినా విన్నర్ తనే అంటూ గట్టిగా ప్రచారం జరుగుతుండడంతో, ఫినాలే వారంపై అంతగా పస లేకుండా పోయింది. ఆడియన్స్ పరిస్థితి ఇలా ఉంటే, సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు తమకు నచ్చిన కంటెస్టెంట్స్కి మద్దతు తెలుపుతూ తమదైన శైలిలో ప్రచారం మొదలెట్టారు.
అలీ రెజాకి యాంకర్ రవి సపోర్ట్గా నిలవగా, రాహుల్కి ప్రముఖ పాప్ సింగర్ నోయెల్ సపోర్ట్గా నిలిచాడు. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన గీతా మాధురి ఇద్దరు కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. వారే రాహుల్ స్లిజంగ్ మరియు శ్రీముఖి. మొదటి సీజన్ టాప్ 3లో నిలిచిన హరితేజ రాహుల్ని సపోర్ట్ చేసింది. ఇక వితిక తన భర్తే బిగ్భాస్ విన్నర్ అంటూ మురిసిపోతోంది. బాబా భాస్కర్ ఫ్యాన్స్ సైలెంట్గా తమ పని తాము చేసుకుపోతున్నారు.
ఇదిలా ఉంటే, సోషల్ మీడియా జ్యోతిష్య పండితులు ఓ కొత్త జ్యోస్యానికి తెర లేపారు. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన గీతా మాధురి బిగ్బాస్ 'ఐ'ని టాటూగా వేయించుకుంది. ఈ సీజన్లో ఆ టాటూ శ్రీముఖి వేయించుకుంది. సో శ్రీముఖి కూడా రన్నరప్గానే నిలుస్తుంది.. అంటూ జోస్యం చెప్పేస్తున్నారు. మరి విన్నర్ ఎవరంటే, రాహుల్ సిప్లిగంజ్ పేరు వినిపిస్తోంది.