'బిగ్‌' షోకి 'బాస్‌' చీఫ్‌ గెస్ట్‌నా.?

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ ఎండింగ్‌కి చేరుకుంది. ఎంత కాదనుకున్నా, ఫినాలేపై ఆసక్తి నెలకొనడం సహజమే. అయితే, గత సీజన్స్‌లో ఫస్ట్‌ సీజన్‌కి ఎన్టీఆర్‌ స్టార్‌డమ్‌ సరిపోయింది. ఎన్టీఆరే బిగ్‌బాస్‌ టైటిల్‌ విజేతను అనౌన్స్‌ చేసేశాడు. కానీ, రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. నానిని మించిన స్టార్‌డమ్‌ కావాలని ఫినాలేకి విక్టరీ వెంకటేష్‌ని తీసుకొచ్చారు.

 

వెంకటేష్‌ చేతుల మీదుగా బిగ్‌బాస్‌ 2 విన్నర్‌ని అనౌన్స్‌ చేశారు. ఇక మూడో సీజన్‌కి ఎలాగూ హోస్ట్‌ రూపంలో నాగార్జున స్టార్‌డమ్‌ ఉంది. అయితే, నాగ్‌ హోస్టింగ్‌లో కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. సో ఫినాలేకి మరింత క్రేజ్‌ తీసుకొచ్చేందుకు బాస్‌ చిరంజీవిని తీసుకు రావాలనుకుంటున్నారట బిగ్‌బాస్‌ టీమ్‌. నిజానికి 'సైరా నరసింహారెడ్డి' సక్సెస్‌ సందర్భంగా ఏదో ఒక వీకెండ్‌లోనే చిరంజీవిని తీసుకొస్తారని ఆశించారు. కానీ, కుదరలేదు.

 

'ఇస్మార్ట్‌ శంకర్‌' టీమ్‌ రామ్‌, నిధి అగర్వాల్‌, 'గద్దలకొండ గణేష్‌' టీమ్‌ తరపున వరుణ్‌ తేజ్‌, 'గ్యాంగ్‌ లీడర్‌' నుండి నాని తదితరులు ఇంతవరకూ బిగ్‌బాస్‌ స్టేజ్‌పై సందడి చేశారు. అయితే అసలు సిసలు గెస్ట్‌గా మెగాస్టార్‌ చిరంజీవి బిగ్‌బాస్‌ సెట్‌పై సందడి చేయనున్నారన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. అయితే, ఈ ప్రచారం నిజమేనా.? నాగార్జునకీ, చిరంజీవికీ మధ్య మంచి స్నేహం ఉంది. ఒకవేళ నాగార్జున అడిగితే, చిరంజీవి రాకుండా ఉండడు. మరి, బిగ్‌బాస్‌ 3 ఫినాలేకి 'చిరు' దర్శనం జరిగేనా? చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS