బిగ్‌బాస్‌ పిచ్చ పీక్స్‌కి చేరిందిగా.!

మరిన్ని వార్తలు

బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది ఈ షో పూర్తి కావడానికి. ప్రస్తుతం ఎనిమిది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్‌ రన్‌ అవుతోంది. చివరి దశలో బిగ్‌బాస్‌ టాస్క్‌లు టఫ్‌గా ఉంటాయని భావించారంతా. కానీ, చివరికొచ్చాక పిచ్చి పిచ్చి టాస్క్‌లిచ్చి మరీ బిగ్‌బాస్‌ షో జనాల్ని పిచ్చివాళ్లను చేసే ప్రయత్నం చేస్తోందంటూ బయట ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టేలా బిగ్‌బాస్‌ నిర్వాహకులు షోలో ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తారో చూడాలిక.

 

ఇదిలా ఉంటే, తాజా ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా రోజంతా కేకులతో కంటెస్టెంట్ల పొట్టలు నింపేశారు. ఆ తర్వాత బిగ్‌బాస్‌ నిద్రకు భంగం కల్గించకూడదంటూ కంటెస్టెంట్లకు ఓ పిచ్చి టాస్క్‌ ఇచ్చారు. ఈ పిచ్చి టాస్క్‌ని పిచ్చి పిచ్చిగా వాడేసి, టాస్క్‌ రూల్‌కి భిన్నంగా బిగ్‌బాస్‌ నిద్రకు భంగం కలిగించారంటూ శివజ్యోతి, వితిక, మహేష్‌, శ్రీముఖి టాస్క్‌ నుండి అవుట్‌ అయ్యారు.

 

చివరిలో బిగ్‌బాస్‌ బర్త్‌డే స్పెషల్‌గా రాహుల్‌ రాసి, ఆలపించిన పాటకు హౌస్‌ మేట్స్‌ ఫన్నీ పర్‌ఫామెన్స్‌ ఇచ్చారు. ఈ పర్‌ఫామెన్స్‌ని బాబా భాస్కర్‌ వీడియో షూట్‌ చేశారు. అలా బిగ్‌బాస్‌ బర్త్‌డే పేరు చెప్పి ఇచ్చిన టాస్క్‌తో కంటెస్టెంట్స్‌తో పాటు, ఆడియన్స్‌ కూడా పిచ్చి వాళ్లయిపోయారు. ఇక వీకెండ్‌ వచ్చేసింది. ఎలిమినేషన్‌ టైమొచ్చేసింది. రాహుల్‌, మహేష్‌, వరుణ్‌ ఎలిమినేషన్‌ లిస్టులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురిలో ఈ వారం హౌస్‌ నుండి బయటికి వెళ్లేదెవరో వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS