రాగల 24 గంటల్లో ఈషా రెబ్బకు ఏమైంది.?

మరిన్ని వార్తలు

తెలుగమ్మాయ్‌ ఈషా రెబ్బ నటనలో రావల్సినంత గుర్తింపు దక్కించేసుకుంది. కానీ, క్షణం తీరిక లేకుండా అవకాశాలు దక్కించుకోవడంలో రేస్‌లో కాస్త వెనకబడిపోయిందంతే. వీలున్నంతలో వచ్చిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకుంటూ, ముందుకెళుతోంది. ప్రస్తుతం ఈ తెలుగమ్మాయ్‌ 'రాగల 24 గంటల్లో' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ కమర్షియల్‌ హీరోయిన్‌గా నటించిన ఈషా రెబ్బకు ఈ సినిమాతో ప్రాధాన్యత గల పాత్ర దక్కిందనే చెప్పాలి. పూర్తిగా హీరోయిన్‌ బేస్‌డ్‌ మూవీ ఇది.

 

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఈషా పాత్ర చాలా కొత్తగా ఉండబోతోందట. ఓ సోషల్‌ కాజ్‌ కోసం పోరాడే యువతికి అనూహ్యంగా ఎదురైన ఓ సమస్య కారణంగా, ఎలాంటి చిక్కుల్లో పడింది. 24 గంటల్లో ఆ యువతి ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.. అనే పాయింట్‌ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ క్రమంలో తెరకెక్కించిన హారర్‌ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయట. దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

'ఢమరుకం' శ్రీనివాస్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ముస్కాన్‌ సేథి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే, తెలుగులోనే కాక తమిళ, కన్నడ భాషల్లోనూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఈ తెలుగమ్మాయ్‌. సహజంగానే తెలుగమ్మాయిలకు తెలుగులో కన్నా, ఇతర భాషల్లోనే ఎక్కువ అవకాశాలు దక్కుతుంటాయి. అలాగే ఇతర భాషల్లో అదృష్టం పరీక్షించుకోవడానికి చూస్తోంది. ఆల్రెడీ తమిళ ప్రజలకు సుపరిచితమైన ఈషా రెబ్బ, త్వరలోనే కన్నడ బాబుల్ని కనువిందు చేయడానికి సిద్ధమవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS