పరమ బోరింగ్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ వేస్ట్‌ అయ్యింది.!

మరిన్ని వార్తలు

ఫస్ట్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా వచ్చిన తమన్నా సింహాద్రి ఎంతో కొంత హౌస్‌లో హడావిడి చేసింది. కానీ, సెకండ్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ శిల్ప చక్రవర్తి మాత్రం పరమ బోరింగ్‌ అనిపించింది. రెండు వారాలు గడిచినా ఆమె హౌస్‌మేట్స్‌తో కలవలేకపోయింది. ఆమెతో హౌస్‌మేట్స్‌ కూడా కంఫర్ట్‌గా కనిపించలేదు. కెప్టెన్సీ టాస్క్‌లో బాబా భాస్కర్‌ కోసం ఇసుక ఎత్తిపోయడం తప్ప, మరే ఇంట్రెస్టింగ్‌ ఇష్యూ శిల్ప చుట్టూ జరగలేదు ఈ రెండు వారాల్లో.

 

ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్న శిల్ప చక్రవర్తి, హౌస్‌ నుండి బయటికి వెళ్లిపోవడం ఖాయమనే న్యూస్‌ బయటికి వచ్చేసింది. ప్రతీ వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన న్యూస్‌ ముందే రివీల్‌ అయిపోతోంది. సో రివీల్‌ అయిన సమాచారం ప్రకారం, ఈ వారం హౌస్‌ నుండి శిల్ప బయటికి వచ్చేయడం కన్‌ఫామ్‌ అని తేలిపోయింది. ఇంతవరకూ ఎవరైతే ఫస్ట్‌ టైమ్‌ నామినేషన్స్‌లోకి వెళుతున్నారో వారు ఎలిమినేట్‌ అవుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు శిల్ప ఫస్ట్‌ టైమ్‌ నామినేషన్‌లో అడుగు పెట్టింది. ఆ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ, ఆమె హౌస్‌లో దుకాణం సర్దేయాల్సిందే.

 

గత సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీల్లో వచ్చిన హీరోయిన్‌ దీక్షా పంత్‌, నవదీప్‌లు రెగ్యులర్‌ హౌస్‌ మేట్స్‌లా కలిసిపోయారు. కానీ, ఈ సారి మాత్రం వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ విషయంలో బిగ్‌బాస్‌ టీమ్‌ నిర్ణయం సరైనది కాదని నెటిజన్స్‌ తేల్చేశారు. నిజానికి వైల్డ్‌ కార్డ్‌లో హాట్‌ హీరోయిన్లు శ్రద్ధానాధ్‌, ఈషా రెబ్బల పేర్లు వినిపించాయి. వాళ్లని తీసుకొచ్చినా షోకి కొంత హైప్‌ వచ్చేది. శిల్పని తీసుకొచ్చి షోని మరీ చీప్‌ చేసేశారన్న వాదన వినిపిస్తోంది. ఈ లోటును బిగ్‌బాస్‌ టీమ్‌ ఎలా పూడ్చుతుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS