ఇద్దరమ్మాయిలతో చిత్రంతో ఆకట్టుకున్న కథానాయిక అమలాపాల్. కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉండగానే దర్శకుడు విజయ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది. ఆ తరవాత విడాకులు తీసుకుని మరోసారి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అమలాపాల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అమలాపాల్ తండ్రి వర్గీస్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. గత కొంతకాలంగా వర్గీస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఈరోజు మధ్యాహ్నం కేరళలో వర్గీస్ అంత్యక్రియలు జరుగుతాయి. అమలాపాల్ హీరోయిన్గా మారడం వెనుక వర్గీస్ కృషి చాలా ఉంది. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే అమలాపాల్ కథానాయిగా మారింది. అమలాపాల్ విడాకులు తీసుకుంటున్న తరుణంలోనూ తండ్రిగా అమలాపాల్కి వెన్నుదన్నుగా నిలిచి, ధైర్యాన్ని అందించారు వర్గీస్. ఆయన మరణం అమలాపాల్కి తీరని లోటే.