ఈవారం ఎలిమినేషన్ స్కెచ్ మార్చిన బిగ్ బాస్..!

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ రియాలిటీ షో రోజురోజుకీ రసవత్తరంగా సాగుతోంది. ఈ షో లో నిన్న నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ వారం నామినేషన్స్ లో కౌశల్, తనీష్, దీప్తి నల్లమోతు, పూజ రామచంద్రన్ ఉన్నారు. అయితే ఈ వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ప్రేక్షకులకి అంతగా నచ్చలేదని బయట టాక్.

ఈ వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియ లో గణేష్ దాదాపు బయటికి వచ్చేస్తాడని అందరూ భావించారు. కానీ అక్కడ మరో విధంగా జరిగింది. బయటపరిస్థితి చూస్తే ముఖ్యంగా బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకి గణేష్ ఆటతీరు పెద్దగా నచ్చట్లేదు. కౌశల్ ఆర్మీ కూడా ఇతనిపై చాలా వ్యతిరేఖత ఉంది. ఈ విషయం బిగ్ బాస్ కి కూడా ముందే అర్థమై ఉంటుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లో ఉంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అందుకే బిగ్ బాస్ స్కెచ్ మార్చి ఈవారం ఇలా చేసారని తెలుస్తుంది.

గతవారం రోల్ రైడా కారణంగా ఎలిమినేషన్ జోన్ నుంచి తప్పించుకున్న గణేష్, ఈవారం నామినేషన్స్ లోకి వస్తాడని అందరూ భావించారు. కాని అతన్ని లైట్ తీసుకున్న మిగతా సభ్యులు కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎంచుకున్నారు. దీంతో కౌశల్ ఆర్మీ స్కెచ్ మారిపోయింది. ఇప్పుడు హౌస్ లో ఎవరున్నా లేకున్నా, కౌశల్ మాత్రం ఉండాలని ఫిక్స్ అయిపోయారు. దీంతో తమ స్టామినా మొత్తం ఉపయోగించి కౌశల్ ని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది.

తనీష్ కి కూడా బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. వాళ్లంతా తమ కంటెస్టెంట్ ని కాపాడుకోవటం పైనే దృష్టి పెడతారు. ఇక మిగిలింది దీప్తి, పూజా. ఇద్దరిలో సేవ్ అవటానికి దీప్తి కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక ఈవారం ఎలిమినేట్ కావటానికి పూజ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS