టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుడు ఎవరంటే.. ఎవరైనా సరే, మహేష్ బాబు పేరే చెబుతారు. తన స్టామినా అలాంటిది. తాజాగా సరిలేరు నీకెవ్వరు కోసం ఏకంగా 50 కోట్ల పారితోషికం అందుకున్నట్టు వార్తలొచ్చాయి. ఆ లెక్కన చూసినా... పారితోషికాల్లో టాప్... మహేషే అనుకోవాలి. అలాంటి మహేష్కి రామ్ చరణ్ ఎంతివ్వబోతున్నాడు? అనేది హాట్ టాపిక్గా మారింది. మహేష్ బాబుకి రామ్ చరణ్ పారితోషికం ఇవ్వడమేమిటి? అనుకుంటున్నారా, అక్కడికే వస్తున్నాం. చిరంజీవి 152వ చిత్రంలో మహేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి చరణ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.
మహేష్ ని ఒప్పించే బాధ్యత రామ్ చరణ్ తీసుకున్నాడని తెలిసింది. చరణ్, మహేష్ మధ్య మంచి రాపో ఉంది. అందుకే చరణ్ మాటని మహేష్ కాదనడని చిరంజీవి నమ్మకం. చరణ్ కూడా మహేష్ కి అదిరిపోయే ఆఫరే ఇచ్చినట్టు టాక్. ఈ సినిమా కోసం మహేష్ 30 రోజుల కాల్షీట్లు కేటాయించాల్సివస్తోంది. అందుకోసం 30 కోట్ల పారితోషికం ఇవ్వడానికి చరణ్ ఒప్పుకున్నాడన్నమాట. అంటే రోజుకి కోటి రూపాయలు. నెల రోజుల్లో తన షూటింగ్ పూర్తవుతుంది. ఆ తరవాత ఎంచక్కా తన సినిమా పనిలో తాను పడిపోవొచ్చు. అందుకే ఈ ఆఫర్ని మహేష్ అంగీకరించాడని తెలుస్తోంది.