ప్రేమించి మోసపోయానంటూ ఛార్మి సంచలన వ్యాఖ్యలు..

మరిన్ని వార్తలు

ఒకప్పటి హీరోయిన్‌ ఛార్మి, ఇప్పుడు నిర్మాతగా మారిపోయింది. పూరి కనెక్ట్స్‌ ద్వారా పలు సినిమాల్ని నిర్మించడమే కాదు, ఈ సంస్థ తరఫున సినీ పరిశ్రమకి పలువురు హీరోయిన్లనీ, నటీనటుల్నీ పరిచయం చేసే బాధ్యతనీ తన భుజాన వేసుకుంది. పూరి జగన్నాథ్‌తో కలిసి ఛార్మి, ఈ పూరి కనెక్ట్స్‌ని నిర్వహిస్తోన్న సంగతి తెల్సిందే. 

పూరి కనెక్ట్స్‌ సంగతి సరే, హీరోయిన్‌గా ఛార్మి మళ్ళీ తెరపై కన్పిస్తుందా? అన్న ప్రశ్నకి ఆమె ఇచ్చిన సమాధానమేంటో తెలుసా? కెమెరా ముందు కన్పించడం కన్నా కెమెరా వెనకాల కన్పించడంలో కొత్త ఆనందం కన్పిస్తోందని. ప్రస్తుతం పూరి కనెక్ట్స్‌ నిర్మిస్తోన్న 'మెహబూబా' సినిమా పనుల్లో ఛార్మి చాలా బిజీగా వుంది. ఇదొక ఛాలెంజింగ్‌ సినిమా ఛార్మి చెబుతోంది. 

సినీ పరిశ్రమలోని ఓ వ్యక్తిని ప్రేమించాననీ, కొన్ని కారణాలతో ఆ ప్రేమను వదులుకోవాల్సి వచ్చిందనీ, ఈ విషయంలో తానే చెడ్డదాన్నని ఛార్మి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంతకీ ఛార్మి ప్రేమించింది ఎవరినో మాత్రం చెప్పలేదు. మళ్ళీ తెరపై కన్పించాలన్న ఆలోచన అయితే వుందనీ, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వుండడం వల్ల నిర్మాణ రంగాన్ని వదిలేసి, నటన వైపు మళ్ళలేకపోతున్నాననీ ఛార్మి వివరించింది. అతి త్వరలో తనను తెరపై చూస్తారని మాత్రం ఛార్మి కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. 

ఛార్మి పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి, తెలుగునాట గుర్తింపు తెచ్చుకుంది. గ్లామరస్‌ హీరోయిన్‌గా ఛార్మి ఓ వెలుగు వెలిగిన సంగతి తెల్సిందే. ఇప్పటికీ కుర్రకారు గుండెల్లో సెగలు రేపగల హాట్‌ అప్పీల్‌ ఛార్మిలో అలాగే వుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS