ఎందుకో ముందు నుంచీ `సైరా`పై బోలెడన్ని రూమర్లు మొదలయ్యాయి. సురేందర్రెడ్డి పనితనం చిరుకి నచ్చలేదని, తనని పక్కన పెట్టి, వినాయక్ని రంగంలోకి దింపాలని చూస్తున్నాడని అప్పట్లో ఓ పుకారు షికారు చేసింది. సూరి తీసిన సన్నివేశాల్ని మళ్లీ చిరు రీషూట్ చేయిస్తున్నాడని చెప్పుకున్నారు.
టీజర్ వచ్చేంత వరకూ ఈ రుమార్లు ఆగలేదు. టీజర్ చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి ఇలాంటి వార్తలకు అడ్డుకట్ట పడింది. అయితే లేటెస్టుగా ఇప్పుడు మరో వార్త గట్టిగా షికారు చేస్తోంది. సురేందర్ రెడ్డి వల్ల బడ్జెట్ పెరిగిపోతోందని, సెట్లో దుబారా ఎక్కువ అవుతోందని చిరు సూరిపై ఫైర్ అవుతున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమా కోసం రూ200 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇప్పటికే బడ్జెట్ అదుపు తప్పిందని, 50 శాతం చిత్రీకరణ పూర్తవ్వకముందే.. బడ్జెట్ మితిమీరిందని చిరు గ్రహించడాని, అందుకే సురేందర్ రెడ్డిని క్లాస్ తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ అంతా రామ్ చరణే స్వయంగా చూసుకుంటున్నాడు.
ఈ విషయంలో చరణ్పైన కూడా చిరు సీరియెస్ అయ్యాడని, అర్జెంటుగా బడ్జెట్ కంట్రోల్ లో పెట్టమని ఆర్డర్ వేశాడని ఇన్ సైడ్ వర్గాల టాక్.