నాగచైతన్య - చందూ మొండేటి కాంబోలో వచ్చిన సినిమా`సవ్యసాచి`. నాగచైతన్య ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి చేర్చిన సినిమా ఇది. అంతేకాదు.. వరుస హిట్లతో దూసుకుపోతున్న మైత్రీ మూవీస్కి తొలి డిజాస్టర్ ఇచ్చిన కథ కూడా ఇదే.
నిజానికి ఈ కథ ముందుగా శర్వానంద్ దగ్గరకు వెళ్లిందట. పాయింట్ నచ్చినా... డేట్లు ఎడ్జిస్ట్ చేయలేకపోవడం వల్ల శర్వా 'నో' చెప్పాడు. అంతేకాదు.. ఈ కథ రవితేజ కూడా విన్నాడట. అయితే చందూ మొండేటి వెర్షన్ లో కాదు. సరిగ్గా.. ఇలాంటి కథే రవితేజకు మరో దర్శకుడు చెప్పాడట. రవితేజ `నో..` అనడంతో ఆప్రాజెక్టు ఆగిపోయింది. ఈ విషయాన్ని రవితేజ ధృవీకరించాడు కూడా.
''సవ్యసాచి పాయింట్తో ఓ కథ విన్నాను. కానీ అది చందూ మొండేటి రాసుకున్న కథ కాదు. అదే పాయింట్ తో మరో కథ నా దగ్గరకు వచ్చింది. కానీ నేను ఓకే చేయలేదు'' అన్నాడు రవితేజ. రవితేజ కనుక ఒప్పుకుంటే... ఒకే పాయింట్తో రెండు కథలు వచ్చేవన్నమాట.
మరి రవితేజ `సవ్యసాచి` ఎలాంటి రిజల్ట్ తీసుకుని వచ్చేదో...??