మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ సినిమా అప్పట్లో సాధించిన విజయం గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. అదే ఆ సినిమా ప్రత్యేకత. తెలుగు నాట భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న రోజులవి. ఆ వరదల నేపథ్యంలో సినిమా నిర్మాణ సంస్థ ఆందోళన చెందింది. కానీ, సంచలన విజయాన్ని అందుకుంది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా కంటెంట్ అలాంటిది.
శ్రీదేవి అందం, చిరంజీవి డాన్సులు, ఇళయరాజా మ్యూజిక్, రాఘవేంద్రరావు టేకింగ్, వైజయంతీ మూవీస్ నిర్మాణ విలువలు.. ఒకటేమిటి.? అన్నీ కలిసి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాని వెండితెర అద్భుతంగా తీర్చిదిద్దాయి. మరి, ఆ సినిమాని మళ్ళీ తెరకెక్కించడం సాధ్యమేనా.? చాలాకాలంగా ఈ విషయమై వైజయంతీ మూవీస్ సంస్థ మల్లగుల్లాలు పడ్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాని మళ్ళీ తెరకెక్కిస్తారనే ప్రచారం జరిగినా, అది ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. అయితే, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మళ్ళీ వస్తుంది.. అంటూ ఈ మధ్యనే నిర్మాత అశ్వనీదత్ కూడా ప్రకటించారు. ఇదిలా వుంటే, ఆనాటి ఆ అద్భుత క్షణాల్ని గుర్తు చేసుకున్న చిరంజీవి, ‘మ్యాజిక్ని మనం ప్లాన్ చేస్తే జరగదు.. అదొక అద్భుతమైన మ్యాజిక్..’ అని అన్నారు.
Magic can not be planned. It just happens! When Magic happens on celluloid, it leaves lasting memories and ever lasting happiness! #JagadekaVeeruduAthilokaSundari @VyjayanthiFilms @Ragavendraraoba #Sridevi #Ilaiyaraaja @SwapnaDuttCh #JVAS30Years https://t.co/WgPnZbQ0gt pic.twitter.com/1LoDDn43sB
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2020