రామిరెడ్డిగారూ మెగా మల్టీస్టారర్‌ వదిలేలా లేరూ.!

మరిన్ని వార్తలు

చాలా రోజుల క్రితం మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్‌ రాబోతోందంటూ ప్రముఖ నిర్మాత కళాబంధు సుబ్బిరామిరెడ్డి ఇంట్రెస్టింగ్‌ అండ్‌ షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌ ఒకటి చేశారు. ఈ మెగా మల్టీ స్టారర్‌కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తారని కూడా ఆయన చెప్పారు. 

అయితే సంవత్సరాలు తిరిగేస్తున్నాయి. కానీ ఆ మల్టీ స్టారర్‌ అలికిడి లేదింతవరకూ. మరో పక్క ఇక్కడ మెగా ఫ్యామిలీలో పరిస్థితులు మారిపోయాయి. చిరంజీవి రాజకీయాలు వదిలేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. పవర్‌స్టార్‌ సినిమాలను వదిలేసి, రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. ఈ తరుణంలో వీరిద్దరూ కలిసి సినిమా చేయడం హౌ.? అనే క్వశ్చన్‌ రాక మానదు. అందుకే సుబ్బిరామిరెడ్డి చేసిన అనౌన్స్‌మెంట్‌ అటకెక్కేసిందేమో అనుకున్నారంతా. కానీ సుబ్బిరామిరెడ్డి గారు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ఈ కాంబినేషన్‌లో తాను సినిమా నిర్మిస్తానని చెబుతూనే ఉన్నారు. 

ఆడియన్స్‌ ఆల్రెడీ మరిచిపోయిన ఈ అనౌన్స్‌మెంట్‌ని ఆయన తాజాగా కూడా గుర్తు చేశారు. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా సుబ్బిరామిరెడ్డి గారు అన్న మాట నిలబెట్టుకునేలానే ఉన్నారు. అయితే చిరంజీవితో ప్రస్తుతం ప్రాబ్లెమ్‌ లేదు కానీ, పవన్‌తోనే వచ్చింది అసలు చిక్కు. అయితే సుబ్బిరామిరెడ్డిగారు తల్చుకుంటే, అదేం పెద్ద చిక్కు కూడా కాకపోవచ్చు. పవన్‌ని ఒప్పించి ఆయన డేట్స్‌ పట్టుకొచ్చినా పట్టుకొస్తారు. 

చూడాలి మరి, ఈ మెగా మల్టీ స్టారర్‌ ఎప్పటికి పట్టాలెక్కేనో.!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS