ప్రముఖ నిర్మాణ సంస్థ అధినేత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో రామాయణ గాధని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఓ కొత్త గాసిప్ పుట్టుకొచ్చింది. నిన్న మొన్నటి దాకా చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్తో ఈ సినిమాని తెరకెక్కించనున్నారట అనే వార్తలు వచ్చాయి. కానీ, అందులో క్లారిటీ లేదు. ఇప్పుడు ఇంకో ఆశక్తికరమైన గాసిప్ ఒకటి చక్కర్లు కొడుతోంది.
మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో నటించనున్నారట. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి, ఇండియన్ సినిమాకి సంబంధించి దాదాపు అగ్రహీరోలంతా ఈ సినిమాలో పార్ట్ కావాలనుకుంటున్నారట. బడ్జెట్ కూడా భారీగానే పెట్టుకున్నారు. దాదాపు 1500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోన్న చిత్రమిది. సో కాస్టింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తే అవకాశాల్లేవని భావిస్తున్నారట. ఇకపోతే, మన అల్లు అరవింద్ సార్ కాంబినేషన్స్ సెట్ చేయడంలో ఆయనకి ఆయనే సాటి. అలాంటి ఆయన హస్తముండగా రామాయణం ఊహించని రీతిలో రూపు దిద్దుకోవడం ఖాయమే అనిపిస్తోంది.
రామాయణం అంటే ఎన్నో పాత్రలు. రాముడు, సీత, లక్ష్మణుడూ, భరతుడు, హనుమంతుడు, రావణుడు.. ఇలా చాలా పాత్రలూ. ప్రతీ పాత్ర దేనికదే ప్రాధాన్యత సంతరించుకోదగ్గదే. ఇప్పటికే సీత పాత్రలో నయనతారనీ, అనుష్క అనీ పలు పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, ఎవరి పేరునూ ఫిక్స్ చేయలేదింకా. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అంటే గాసిప్స్ ఆటోమెటిగ్గా పుట్టుకురావడం సహజమే. కానీ, అల్లు అరవింద్ మాత్రం పూర్తి స్పష్టతతో ఉన్నారట. త్వరలోనే అన్ని విషయాల్లోనూ క్లారిటీ ఇవ్వనున్నారట.