ట్రాక్‌ మార్చేసిన మిల్కీ బ్యూటీ!

మరిన్ని వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నాకి ఈ ఏడాది 'ఎఫ్‌ 2' ఇచ్చిన రిలాక్స్‌డేషన్‌ అంతా ఇంతా కాదు. సూపర్‌ బ్లాక్‌ బస్టర్‌ ఆమె ఖాతాలో పడింది ఈ సినిమా ద్వారా. తర్వాత 'దేవి 2' చిత్రంలో నటించింది కానీ, ఆ సినిమా ఆశించిన రిజల్ట్‌ అందించలేదు. అలా అని ఆ ఎఫెక్ట్‌తో 'ఎఫ్‌ 2' హిట్‌ ఫ్లేవర్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల దర్శకుడు ఓంకార్‌తో 'రాజుగారి గది 3' సినిమాని లాంఛనంగా ప్రారంభించిన తమన్నా, స్క్రిప్టులో వచ్చిన బేధాభిప్రాయాల కారణంగా ఆ సినిమా నుండి వైదొలగిన సంగతి తెలిసిందే.

 

ఇక త్వరలో 'సైరా' తో ప్రేక్షకుల ముందుకు రానుంది తమన్నా. మరోవైపు ఆమె నటించిన 'దటీజ్‌ మహాలక్ష్మి' విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు నార్త్‌లోనూ ఓ సినిమాతో బిజీగా ఉంది తమన్నా. ఇదంతా బాగానే ఉంది. కానీ, తమన్నా తీసుకున్న తాజా నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 'సైరా' తర్వాత తమన్నా, రెగ్యులర్‌ పాత్రలకు టాటా, బైబై చెప్పేస్తుందట. సరికొత్త విలక్షణ పాత్రలకు శ్రీకారం చుట్టనుందట. అంటే ఇకపై తమన్నాని సరికొత్తగా చూడబోతున్నామని అర్ధం.

 

ఇంతవరకూ గ్లామర్‌ పాత్రలతో పాటు, ఓ మోస్తరు పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్న తమన్నాలో ఓ కొత్త నటి కూడా దాగుందట. ఆ కొత్త నటిని బయటికి తీస్తానంటోంది. ఆ దిశగా కథల వేట ఆల్రెడీ స్టార్ట్‌ చేసిందట తమన్నా. త్వరలోనే అందుకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట్‌ వివరాలు వెల్లడిస్తానంటోంది. తమన్నా తీసుకున్న ఈ నిర్ణయంతో ఎలాంటి కొత్త క్యారెక్టర్‌లో తమన్నా కనిపించబోతోందా.? అనే క్యూరియాసిటీ ఆమె ఫ్యాన్స్‌లో మొదలైంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS