తెలంగాణా గవర్నర్ తమిళసైని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గౌరవ ప్రదంగా కలిసిన సంగతి తెలిసిందే. తన 151వ సినిమా 'సైరా నరసింహారెడ్డి' చూడాల్సిందిగా ఆ సందర్భంగా చిరంజీవి గవర్నర్ని కోరడం, ఆయన కోరిక మన్నించిన తమళసై కుటుంబంతో సహా సినిమాని వీక్షించి ప్రశంసించడం కూడా తెలిసిందే. తదుపరి చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఈ నెల 14న తనయుడు రామ్చరణ్తో కలిసి జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు చిరంజీవి.
తాడేపల్లి గూడెంలోని సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద జగన్తో చిరంజీవి భేటీ కానున్నారు. 'సైరా నరసింహారెడ్డి' సినిమా చూడమని ఈ సందర్భంగా జగన్ని చిరు కోరనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం డే వన్ నుండీ పాజిటివ్ టాక్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతోన్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ విశేషంగా అలరిస్తోంది 'సైరా నరసింహారెడ్డి' చిత్రం.
గొప్ప విషయమేంటంటే, పిల్లల్ని కూడా 'సైరా నరసింహారెడ్డి' విపరీతంగా ఇన్స్పైర్ చేస్తున్నాడు. కామెడీ, పాటల్లేకుండా పిల్లలు ధియేటర్లో కూర్చోవడం చాలా కష్టం. అలాంటిది ఏం మాయ చేస్తున్నాడో సైరా నరసింహారెడ్డి ముఖ్యంగా పది, పన్నెండేళ్ల లోపు వయసున్న పిల్లలు కూడా 'సైరా'ని మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు. దటీజ్ చిరంజీవి. సైరా.. సై సైరా..!