నిఖిల్‌ కోసం రీ ఎంట్రీ ఇస్తోన్న కలర్స్‌ స్వాతి.

మరిన్ని వార్తలు

అసలు విడుదలవుతుందో లేదో అనుకున్న 'అర్జున్‌ సురవరం' సినిమా రిలీజై నిర్మాతలకు కాసుల పంట పండించడంతో నిఖిల్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. తదుపరి ప్రాజెక్ట్స్‌ని వరుసగా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ కొన్ని సెట్స్‌పై ఉన్నాయి. ఇక నిఖిల్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన 'కార్తికేయ 2' కూడా త్వరలోనే పట్టాలెక్కించనున్నాడట. చందూ మొండేటి ఈ సినిమాకి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ పేరు తెర పైకి వచ్చింది.

 

మొదటి పార్ట్‌లో కలర్స్‌ స్వాతి నటించింది. ఇటు నిఖిల్‌కీ, అటు కలర్స్‌ స్వాతికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజా విషయమేంంటే, సెకండ్‌ పార్ట్‌లో కూడా కలర్స్‌ స్వాతి నటించనుందట. అయితే, హీరోయిన్‌గా కాదు. జస్ట్‌ గెస్ట్‌ రోల్‌ పోషించనుందట. ప్రస్తుతం స్వాతి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. మళ్లీ సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్‌ ఉందా.? అని అడిగితే, మంచి ఛాన్స్‌ వస్తే నటిస్తాను అని చెప్పింది. మరి నిఖిల్‌తో రెండు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన పరిచయం ఎలాగూ ఉంది కనుక, నిఖిల్‌ అడిగితే స్వాతి కాదనదేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS