రంగస్థలం చూసి తీవ్ర నిరాశకు గురైన కమెడియన్ పృథ్వి

మరిన్ని వార్తలు

రంగస్థలం.. రంగస్థలం.. ఇప్పుడు తెలుగు సినిమాని ఆదరించే ప్రతిఒక్కరి నోట వినిపిస్తున్న మాట. ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో, ఈ విషయం బట్టి అర్ధమవుతుంది. ఇటు ఫ్యాన్స్ నే కాక అటు సామాన్య ప్రేక్షకులని సైతం ఈ చిత్రం ఆకట్టుకుంటున్నది.

అయితే ఒక ప్రముఖ కమెడియన్ మాత్రం ఈ చిత్రం విషయంలో ఒకింత నిరుత్సాహానికి గురయ్యాడు అని సమాచారం. ఆ కమెడియన్ ఎవరంటే- 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫేం పృథ్వీ. అసలేం జరిగిందంటే- ఈ చిత్రంలో పృథ్వీ ఒక కామెడీ ట్రాక్ చేశాడట, దాని నిడివి సుమారు 5 నిముషాలు ఉంటుందట. అయితే ఆ సన్నివేశాలని సినిమా నిడివి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో సినిమా నుండి పూర్తిగా తీసెయ్యడం జరిగిందట.

ఈ విషయం తెలుసుకుని పృథ్వీ తీవ్ర నిరాశకి గురయ్యాడట. అయితే సినిమా విడుదలకి ముందు సుకుమార్ మాట్లాడుతూ- చిరంజీవి గారు సినిమా చూసి ఒక్క కట్ కూడా చెప్పలేదు. దీన్నిబట్టి చిరంజీవికి సినిమా చూపించకముందే ఈ సన్నివేశాలు ఎడిట్ అయిపోయాయని తెలుస్తున్నది.

రంగస్థలం లాంటి ఒక మంచి చిత్రంలో నటించిన తృప్తి తనకి ఉన్నప్పటికీ అది తెరపైన చూసుకునే అదృష్టం లేదు ఆయన వాపోతున్నాడట. మరి డిజిటల్ వెర్షన్ లో అయినా ఈయన పాత్రని ఉంటుందా లేదా అనేది తెలియాల్సిఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS