కరోనా కారణంగా ఇంటి నుండి బయటికి వెల్లడానికి ఆంక్షలు జారీ చేసారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే ఆఫీసులు, స్కూళ్లు, హాస్టల్స్, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్.. షాపింగ్ మాల్స్ అన్నీ బంధ్ చేసేశారు. సర్లే బంద్ అయితే అయ్యాయ్, ఇంట్లో కూర్చొని టీవీ ఎంటర్టైన్మెంట్స్తో పండగ చేసుకోవచ్చులే అని కాస్త ఊరట పొందేవారికి ఇకపై వేటు పడనుంది. ఈ రోజు నుండి టీవీ షూటింగ్స్ కూడా రద్దు కానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షోలూ, గేమ్ షోస్, టీవీ సీరియల్ షూటింగ్స్ కూడా మార్చి 31 వరకూ రద్దు చేస్తున్నామనీ టీవీ టెక్నికల్ ఫెడరేషన్ యూనియన్ తెలియజేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని గడగడలాడిస్తున్న కరోనా ఇంపాక్ట్ ఇక ముందు ముందు ఏయే ప్రభావం చూపుతుందో కానీ, కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఆదివారం నుండి ప్రజలు ఇళ్ల నుండి కూడా బయటికి రాకూడదనే ఆంక్షలు విధించారు గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు. 60 ఇయర్స్ పైబడిన ముసలి వాళ్లు, టెన్ ఇయర్స్ లోపు చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్త వహించాలని ప్రభుత్వం కోరింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యక్తిగత పరిశుభ్రత ఒక్కటే మార్గమని సూచించింది.