వాడకంలో రవిబాబును మించిన వాళ్లే లేరనాలి. వినూత్నంగా సినిమాలు తెరకెక్కించడమే కాదు, తెరకెక్కించిన సినిమాల్ని అంతకన్నా వినూత్నంగా ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో కూడా ఆయనకి తెలిసినంత బాగా మరో డైరెక్టర్కి తెలీదంటే అతిశయోక్తి కాదేమో. అందుకే అంటారు డైరెక్టర్స్ యందు రవిబాబు వేరయా.. అని. ‘అదిగో’ సినిమా టైమ్లో డీమానిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) సీజన్ నడిచింది. ఈ సీజన్ని తన సినిమా ప్రమోషన్ కోసం వాడేశాడు రవిబాబు. ‘అదిగో’లో కీలక పాత్రధారి అయిన పందిపిల్లతో కలిసి ఏటీఎమ్ సెంటర్ వద్ద క్యూలో నిబడ్డాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘క్రష్’నీ ప్రమోషన్స్లోకి దించాడు. మరి ఈ సారేం చేశాడనేగా మీ క్యూరియాసిటీ. అక్కడికే వస్తున్నాం ఆగండాగండి.
ప్రజెంట్ ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా, ‘కరోనా’ డిస్కషనే. అందుకే దీన్నే తన సినిమాకి పబ్లిసిటీ ఎలిమెంట్గా ఎంచుకున్నాడు మన దర్శకుడు. కరోనా కారణంగా మాస్క్లు ధరించమని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇదే అదను అనుకుని, మార్కెట్లో మాస్క్లు దొరక్కుండా చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. దొరక్కపోవడం సంగతి అటుంచితే, మన డైరెక్టర్గారు తన కొత్త సినిమా ‘క్రష్’ నుండి కొన్ని లుక్స్ రిలీజ్ చేశారు. ఆ లుక్స్లో ఒకటి హీరో, హీరోయిన్ లిప్లాక్ పోస్టర్ ఉంది. వారిద్దరికీ మాస్క్ పెట్టేసి, ఈ పోస్టర్ వదిలారు. అలాగే మరో పోస్టర్లోనూ పాత్రధారుందరికీ మాస్క్లు వేసేశారు. ఇదే మరి, ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.. అంటే, ఇటు కరోనా అవేర్నెస్.. అటు తన సినిమా ప్రమోషన్.. పోలా అదిరిపోలా.!