గోపీచంద్‌ కోసం ‘మెగా’ విలన్‌.!

మరిన్ని వార్తలు

‘ఖైదీ నెంబర్‌ 150’లో విలన్‌గా నటించిన తరుణ్‌ అరోరా లేటెస్ట్‌గా గోపీచంద్‌ సినిమాలో నటిస్తున్నాడు. గోపీచంద్‌ తాజా చిత్రం ‘సీటీమార్‌’ కోసం ఈయన విలన్‌ అవతారమెత్తబోతున్నాడు. ఈ సినిమాలో తరుణ్‌ అరోరా సరికొత్త విలనిజం ప్రదర్శించబోతున్నాడనీ తెలుస్తోంది. సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కబడ్డీ నేపథ్యంలో సాగే చిత్రమిది. గోపీచంద్‌, తమన్నా ఇద్దరూ కబడ్డీ కోచ్‌లుగా నటిస్తున్నారు. ‘ప్రెషర్‌ కుక్కర్‌’ ఫేమ్ ప్రియా అస్రాని ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది.

 

రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన గోపీచంద్‌, తమన్నా ఫస్ట్‌లుక్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే, తరుణ్‌ అరోరా అప్పియరెన్స్‌ ఈ సినిమాకి మెయిన్‌ అస్సెట్‌ కానుందనిపిస్తోంది. మాస్‌ మసాలా స్టోరీస్‌ని సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించడంలో అందె వేసిన చెయ్యి అయిన సంపత్‌నంది, గోపీచంద్‌ కాంబోలో గతంలో తెరకెక్కిన ‘గౌతమ్‌ నందా’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి మాత్రం ఎలాంటి మిస్టేక్స్‌ జరగకుండా ఖచ్చితంగా గోపీచంద్‌కి సక్సెస్‌ ఇవ్వాలన్న కసితో సంపత్‌నంది వర్క్‌ చేస్తున్నాడట. అవుట్‌ పుట్‌ ఆశించనట్లుగానే వస్తోందట. అందులోనూ ఈ మధ్య స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందుతోన్న సినిమాలకు ఆదరణ బాగుండడంతో . గోపీచంద్‌కి ఈ ఫార్ములా కలిసొస్తుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS