అయ్యోపాపం కీర్తి సురేష్‌ పరిస్థితేంటి?

మరిన్ని వార్తలు

గ్లామర్‌కి దూరంగా యాక్టింగ్‌కి స్కోపున్న క్యారెక్టర్స్‌నే ఎంచుకుంటూ, తొలి సినిమా నుండీ, మంచి నటిగా ప్రూవ్‌ చేసుకుంటోంది ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. అయితే కీర్తికిప్పుడు విషమ పరిస్థితి ఎదురైంది. అలనాటి మేటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతోన్న 'మహానటి' సినిమాలో కీర్తి సురేష్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 

సావిత్రి పాత్రను పోషించడం అంటే చిన్న విషయం కాదు. నటనలో ఎంత టాలెంట్‌ ఉన్నప్పటికీ, అనుభవం అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ నటనానుభవం కీర్తి సురేష్‌కి చాలా తక్కువ. అందుకే ఈ పాత్ర పోషిస్తున్నందుకు చాలా విమర్శలు ఎదుర్కొంటోంది. మొదట్లో సమంత, నిత్యామీనన్‌ ఇలా నటనలో అనుభవం వున్న ముద్దుగుమ్మల పేర్లు పరిశీలించారు ఈ పాత్ర కోసం. అనూహ్యంగా ఆ ఛాన్స్‌ కీర్తి తన్నుకెళ్లిపోయింది. ఛాన్స్‌ దక్కినప్పుడు బాగానే ఉంది. అయితే అంతటి గౌరవం ఉన్న పాత్రకి కీర్తిని ఊహించుకోవడమనే విషయాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తమకు తోచిన రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

అయినా కానీ కీర్తి మాత్రం పూర్తి నమ్మకంతో ఉంది. తనకు దక్కిన ఈ అరుదైన గౌరవాన్ని అంతే జాగ్రత్తగా ఉపయోగించుకున్నాననీ అంటోంది. ఈ పాత్ర పోషించేందుకు ముందే తాను ఎంతో గ్రౌండ్‌ వర్క్‌ చేశాననీ చెప్పుకొస్తోంది. ఏది ఏమైనా సినిమా షూటింగ్‌ పూర్తయిపోయింది. ఇంత భారమైన పాత్ర కాబట్టే, షూటింగ్‌ పూర్తి చేసుకున్న కీర్తి సురేష్‌ సెట్‌లో తెలియని భావోద్వేగానికి లోనైందట.

చూడాలి మరి, తెరపై కీర్తి తన టాలెంట్‌ని ఎలా ప్రదర్శించిందో. త్వరలోనే రిలీజ్‌కు 'మహానటి' ముస్తాబవుతోంది. కీర్తితో పాటు, సమంత, దుల్కర్‌ సల్మాన్‌, ప్రకాష్‌రాజ్‌, విజయ్‌ దేవరకొండ తదితర నటీ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS