బాలీవుడ్ జంట దీపికా పడుకొనే, రణ్వీర్ సింగ్ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త జంటకు శుభాకాంక్షలు పోటెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు 'దీప్ వీర్' జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలా శుభాకాంక్షలు చెబుతున్న లిస్ట్లో ప్రముఖ కండోమ్ తయారీ కంపెనీలు కూడా వున్నాయి.
మామూలుగా శుభాకాంక్షలు చెబితే కిక్ ఏముంటుంది.? అందుకే, మాంఛి కిక్ ఇచ్చేలా శుభాకాంక్షలు చెప్పేశాయి కండోమ్ కంపెనీలు. 'వి హేవ్ గాట్ యు కవర్డ్..' అంటూ నాటీ మెసేజ్ పోస్ట్ చేసింది డ్యూరెక్స్ సంస్థ. మేన్ ఫోర్స్ కండోయ్ తయారీ సంస్థ అయితే, ఇంకా నాటీగా శుభాకాంక్షలు తెలిపింది 'దీప్ వీర్' జంటకి. 'ది వార్డ్ రోబ్స్ ఈజ్ రెడీ..' అంటూ రకరకాల ఫ్లేవర్డ్ కండోమ్స్తో కూడిన ప్రకటనని, 'మీ స్పెషల్ డే కోసం పలు ఆప్షన్స్ వున్నాయి..' అంటూ కామెంట్నీ పోస్ట్ చేసింది మేన్ ఫోర్స్. దాంతో, ఒక్కసారిగా 'దీప్ - వీర్' అభిమానులు షాక్కి గురయ్యారు.
బాలీవుడ్ తారల పెళ్ళిని ఇలా ప్రచారం కోసం వాడుకోవడమేంటని ఆయా సంస్థలపై మండిపడ్తున్నారు కొందరు. ఖరీదైన పెళ్ళిళ్ళు చేసుకోవడమే కాదు, ఆ పెళ్ళి విశేషాల్ని అమ్ముకునేందుకూ సెలబ్రిటీలు ప్రయత్నిస్తుండడం మామూలే. మరి, ఈ సంస్థల విషయంలో 'దీప్ - వీర్' ముందే ఒప్పందాలు ఏమైనా కుదుర్చుకున్నారా.? అన్నది చర్చనీయాంశంగా మారుతోంది.
'కండోమ్' వినియోగం పట్ల అవగాహన పెంచడం మంచిదే.. కానీ, ఆ పేరు చెప్పి, ఇలాంటి నాటీ మెసేజ్లు.. అదీ వెడ్డింగ్ శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేయడమేంటన్నదే ప్రశ్న.