ఈ మధ్య చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా సినిమాలు వివాదాల్లో చిక్కుకుంటున్న ముచ్చట ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తాజాగా ఈ వివాదాల లిస్టులోకి చేరింది ఓ చిన్న సినిమా. ట్రూ స్టోరీ అంటూ తెరకెక్కిన ‘డిగ్రీ కాలేజ్’ అనే సినిమాలో అసభ్యకరమైన శృంగార సన్నివేశాలు వున్నాయంటూ కొందరు సెన్సార్ బోర్డ్కి లేఖ రాశారు. అంతే కాదు, గతంలో కొందరు విద్యార్ధులు కూడా ఈ సినిమా పోస్టర్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు దర్శకుడు నరసింహను విచారించారు.
అభ్యంతరకర సన్నివేశాల్ని తొలగించాలంటూ కోరారు. కానీ, దర్శకుడు మాత్రం అందుకు నిరాకరిస్తూ, గతంలో ఇంతకన్నా దారుణమైన పోస్టర్స్తో సినిమాు రిలీజ్ చేశారు. కానీ, అప్పుడెప్పుడూ రాని అభ్యంతరాలు నా సినిమాకే ఎందుకు వస్తున్నాయి.. అంటూ ఎదురు ప్రశ్నకు దిగాడు. అంతేకాదు, తన సినిమాను అడ్డుకుంటే, దాని పర్యవసానం మరోలా ఉంటుందని హెచ్చరిస్తున్నాడు కూడా. అయితే, పెద్ద సినిమాకే వివాదాల కారణంగా కొన్ని మార్పు చేర్పు చేసుకోక తప్పలేదు. అలాంటిది ఈ చిన్న సినిమా విషయంలో సదరు దర్శకుడు మంకు పట్టు పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అయితే, ఈ వివాదం నుండి దర్శకుడు ఎలా బయటపడతాడో, సినిమాలో మార్పు చేస్తాడా.? లేక వివాదానికి ఎదురెళ్లి సినిమాని సక్సెస్ చేసుకుంటాడా.? ఈ వివాదం మరింత బపడితే, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి.? అనేది వేచి చూడాలి మరి.