దిల్రాజు భలే మేధావి. తన సినిమాకి ఎలా ప్రమోషన్ తెచ్చుకోవాలో, ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. పైసా ఖర్చు లేకుండా కూడా ప్రచారం చేసుకోగలడు. అయితే తన సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం `వి` పై అసలేమాత్రం శ్రద్ధ లేనట్టే వ్యవహరిస్తున్నాడు. అన్నీ సవ్యంగా ఉంటే ఈ ఉగాదికి ఈ చిత్రం విడుదల కావాలి.కానీ.. కరోనా పుణ్యమా అని వాయిదా పడింది. అయితే.. ఈ సినిమాకి సంబంధించి ఒక్క ప్రమోషన్ ఈవెంట్ కూడా నిర్వహించలేదు.
సినిమాని ఎలాంటి హైపూ లేకుండా, సైలెంట్గా విడుదల చేద్దామనుకుంటున్నాడా, లేదంటే... అసలు ఈ సినిమాకి ప్రచారమే అవసరం లేదని భావిస్తున్నాడా? అనేది అర్థం కావడం లేదు. నాని, సుధీర్ బాబు కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది. నాని ఉన్నాడు కాబట్టి... జనం థియేటర్లకు వచ్చేస్తారని దిల్ రాజు భావించి ఉంటాడు. అన్నింటికంటే ప్రధాన సమస్య ఏమిటంటే... నాని, సుధీర్ బాబు ఇద్దరూ ఈ సినిమాని పట్టించుకోవడం లేదని టాక్. ఇద్దరి మధ్య ఏవో చిన్న చిన్న గ్యాపులు వచ్చాయని, వాళ్లమధ్య ఆధిపత్య పోరు మొదలైందని, అందుకే ఈ సినిమాని ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నటాక్ నడుస్తోంది.