బాలీవుడ్ వైపు.. దిల్‌రాజు తొలి అడుగు.

మరిన్ని వార్తలు

నిర్మాత దిల్ రాజు సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. సినిమా నిర్మాణంని ఇంకా విస్తరించాలని, ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలనే ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఎనిమిది నిర్మాతలని కలుపుకున్నారు. ఈ ఎనిమిది మంది చేసే సినిమాలకు దిల్ రాజు బ్యాక్ బోన్ గా వుంటారు. ఈ ఎనిమిది మంది నిర్మాతల్లో ఎవరైనా మంచి కథతో వస్తే.. కొంత ఫైనాన్స్ సపోర్ట్ చేసి , ఆ సినిమా రిలీజ్ భాద్యత కూడా తీసుకుంటారు.

 

ఇక బాలీవుడ్ లో కూడా సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం బొంబాయిలో ఆఫీస్ కూడా తీసుకున్నారు. ఇక బాలీవుడ్ సినిమా కూడా ఫైనల్ అయ్యింది. రామ్ చరణ్ తో 'ఎవడు' సినిమా తీశారు దిల్ రాజు. ఇది హిట్. ఇప్పుడు ఈ సినిమానే బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.

 

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. అలాగే ఈ సినిమాకి దర్శకుడు కూడా ఫిక్స్ అయ్యాడు. 'సత్యమేవ జయతే' తీసిన మిలాప్ మిలాన్ ఝవేరి ని ఈ రీమేక్ కు దర్శకుడిగా ఎంచుకున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలైయింది. త్వరలోనే స్టార్ కాస్ట్ ప్రకటిస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS