బాలా దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్‌.!

మరిన్ని వార్తలు

ప్రముఖ దర్శకుడు బాలాకు ఈ మధ్య తమిళ అర్జున్‌రెడ్డి 'వర్మ' విషయంలో జరిగిన అన్యాయం సంగతి అందరికీ తెలిసిందే. సీనియర్‌ దర్శకుడు కాబట్టి, ఈ విషయాన్ని పెద్దగా ఇష్యూ చేయకుండా, కామ్‌గా ఊరుకున్నాడు. 'వర్మ' ఇష్యూ నుండి తేరుకున్నాక బాలా తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. అయితే ఈ సారి బాలా ఓ భారీ మల్టీ స్టారర్‌పై కన్నేశాడట. ఆర్య, అధర్వలను హీరోలుగా పెట్టి ఓ డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించబోతున్నాడు. 

 

ఆల్రెడీ ఈ సినిమా కథను హీరోలిద్దరికీ వినిపించాడట. ఈ సినిమాలో నటించేందుకు ఇద్దరూ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. అందులో ఒకరిగా తెలుగమ్మాయి బిందుమాధవిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పదహారణాల తెలుగమ్మాయి బిందుమాధవి తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా తమిళంలో స్టార్‌డమ్‌ దక్కించుకుంది. 

 

తాజా ఆఫర్‌తో ఎగిరి గంతేస్తోందట. బాలా వంటి ప్రముఖ దర్శకుడితో పని చేయడం తనకెంతో ఆనందంగా ఉందనీ చెబుతోంది. ఇకపోతే గతంలోనూ పలు మల్టీ స్టారర్లు తెరకెక్కించిన అనుభవం ఉన్న బాలా తాజా ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారట. మొన్న జరిగిన 'వర్మ' ఇష్యూ ఆయన్ని మానసికంగా కుంగదీసింది. అందులోంచి తేరుకోవాలంటే, ఖచ్చితంగా ఈ సినిమాతో బాలాకి న్యాయం జరగాలి. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించాలి. చూద్దాం. ఏం జరుగుతుందో. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS