ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తండ్రి శ్రీకాంత శర్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు శ్రీకాంతశర్మ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.శ్రీకాంత శర్మ పేరొందిన పండితుడు.
గేయకవి, రచయిత. గతంలో పత్రికాసంపాదకుడిగా పని చేశారు. ఇవాళ సాయంత్రం అల్వాల్లో ఆయన అంత్యక్రియలునిర్వహించనున్నట్లు సమాచారం. అష్టాచమ్మా, జెంటిల్మెన్ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు ఇంద్రగంటి. ప్రస్తుతం నాని, సుధీర్బాబు కథానాయకులుగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.