ఈ మధ్య డిజిటల్ ప్లాట్ఫామ్కి ఆదరణ ఎక్కువైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుండి సమంత వంటి స్టార్ సెలబ్రిటీలే వెబ్ సిరీస్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ క్రమంలో సమంత ‘ది ఫ్యామిలీ మేన్ 2’ సిరీస్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంతే కాదు, కాజల్ తదితర ముద్దుగుమ్మలు కూడా వెబ్ సిరీస్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇకపోతే సెబ్రిటీలతో పాటు , స్టార్ డైరెక్టర్సూ, ప్రొడ్యూసర్స్ కూడా వెబ్ సిరీస్పై ఖర్చు చేయడానికి ముందుకొస్తున్నారు. ఆ క్రమంలో స్టార్ డైరెక్టర్ క్రిష్ లేటెస్ట్గా ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఈ వెబ్ సిరీస్లో టాలీవుడ్, బాలీవుడ్ నుండి ప్రముఖ స్టార్లు నటించబోతున్నారట. క్రిష్కి తెలుగుతో పాటు, హిందీలోనూ మంచి పాపులారిటీ ఉంది. బాలీవుడ్లో కంగనా రనౌత్తో ఆయన ‘మణి కర్ణిక’ సినిమా రూపొందించైనా విషయం తెలిసిందే. ఇకపోతే, ప్రస్తుతం క్రిష్ప, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఓ పీరియాడిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. మార్చిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ, కరోన రీజన్ తో డిలే అయ్యింది. పరిస్థితులు అనుకూలిస్తే, త్వరలోనే క్రిష్ ` పవన్ కళ్యాణ్ మూవీ పట్టాలెక్కనుంది. మొగల్ కాలం నాటి బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా కోసం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ లుక్ టెస్ట్ కూడా జరిగినట్లు సమాచారం ఉంది.