దర్శకురాలు సంజనా రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. పాత్రికేయురాలిగా తన ప్రయాణం ప్రారంభించింది సంజన. రాజ్ తరుణ్తో `రాజుగాడు` సినిమాతో దర్శకురాలిగా పరిచయమైంది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. కొంత విరామం తీసుకుని ఇప్పుడు కరణం మల్లీశ్వరి బయోపిక్ ని తెరపై తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కోన వెంకట్ నిర్మాత. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. మరోవైపు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రారంభమైంది. ఈలోగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. సంజన కోలుకుంటున్నారని, ఈరోజే ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు తెలిపారు.