ఎన్టీఆర్‌ బయోపిక్‌పై తేజ సంచలన వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ ఇటీవల విడుదలై డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో మొదట అనౌన్స్‌ చేయబడిన ఈ సినిమా దర్శకత్వం నుండి తేజ తప్పుకుని, క్రిష్‌ వచ్చి చేరిన సంగతి కూడా విదితమే. ఓ సంచలనంగా మొదలైన ఈ సినిమా పేరు చెప్పి, ఎన్టీఆర్‌ని అవమానం పాలు చేశారంటూ వాదన వినిపించింది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్‌ తేజ స్పందించారు.

 

ఈ సినిమాకి న్యాయం చేయలేననుకునే నా అంతట నేనుగా ఈ సినిమా డైరెక్షన్‌ నుండి తప్పుకున్నాను.. ఈ విషయం గతంలోనూ చెప్పాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నాను. ఈ బయోపిక్‌ విషయంలో తెర వెనుక చాలా ఒత్తిడులు పని చేశాయి. ఆ ఒత్తిడులు తట్టుకోలేకనే నేను తప్పుకున్నాను. పాపం క్రిష్‌ బలైపోయారు. అలాంటి భయంకరమైన ఒత్తిడుల నడుమ తెరకెక్కి సినిమా డిజాస్టర్‌గా మిగిలింది.

 

ఒకవేళ క్రిష్‌ కాకుండా, నేనే ఈ సినిమాని తెరకెక్కించి ఉంటే, ఇంకా చెండాలంగా తెరకెక్కించి ఉండేవాడ్నేమో.. అని తేజ చెప్పారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో 'సీత' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'సీత' ప్రమోషన్స్‌లో పాల్గొన్న తేజ, ఎన్టీఆర్‌ బయోపిక్‌ విషయమై అడిగిన ప్రశ్నలకు తన మనసులోని మాటల్ని పై విధంగా మీడియాతో పంచుకున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS