'డిస్కోరాజా'కి విలన్‌ ఎవరో తెలుసా.?

మరిన్ని వార్తలు

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటించిన 'వాల్మీకి' సినిమాకీ, అదేనండీ 'గద్దలకొండ గణేష్‌'కీ, రవితేజ తాజా చిత్రం 'డిస్కోరాజా'కీ ఓ సంబంధం వుంది. ఏంటా సంబంధం అనుకుంటున్నారా.? విలన్‌కీ, హీరోకీ ఉండే సంబంధం. అసలు వివరాల్లోకి వెళితే, 'గద్దలకొండ గణేష్‌' ఒరిజినల్‌ అయిన 'జిగర్తాండ'లో లీడ్‌ రోల్‌ పోషించిన నటుడు తెలుసే ఉంటుంది. పేరు బాబీ సింహా. ఆయన ఇప్పుడు రవితేజ 'డిస్కోరాజా'లో విలన్‌గా నటిస్తున్నాడు. లేటెస్ట్‌గా ఈ సినిమాలోని ఆయన లుక్‌ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌.

 

'జిగర్తాండ' కోసం తన లుక్‌ని ఛేంజ్‌ చేసుకున్న బాబీ సింహా ఇప్పుడు 'డిస్కోరాజా' కోసం కూడా డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. డిఫరెంట్‌ విలనిజం ప్రదర్శిస్తాడట కూడా. వైట్‌ హెయిర్‌తో కళ్లజోడు పెట్టుకుని, నవ్వుతూ కనిపిస్తున్నారాయన. కానీ, ఆ నవ్వు వెనక విలనిజం ఉట్టిపడుతోంది. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రిస్మస్‌కి ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు. నభా నటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల విడుదలైన 'డిస్కోరాజా' ఆడియో సింగిల్‌ లిరిక్స్‌ అద్భుతంగా ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS